Wednesday, February 26, 2014

పద్య సాహిత్యం--6 (జవాబులు)


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు................

"ఏలా వచ్చె హవా...........................
..................................బట్టించుచున్‌ నవ్వుచున్‌"

ఈ పద్యం "ఉమర్ ఖయ్యామ్‌" నాటకం లోనిది.

"ఏలా దాచితి విన్ని..................................
........................................బాడనా కేకినై!"

ఇది "ధనుర్దాసు" నాటకం లోనిది.

"ప్రాతదారులందు......................
..............................వినుర వేమ."

"పలుచ పలుచ...........................
..............................వినుర వేమ."

ఈ రెండూ "విశ్వదాభిరామ" మకుటంతో వ్రాసిన సుమారు 300 ఆటవెలది పద్యాల్లోవి.

"...........ఏననంత శోక.................
.....................ఎవ్వరని యెంతురో నన్ను?"

ఇది చాలామందికి తెలిసినదే. కవి ప్రత్యేక ముద్ర కనిపిస్తూనే వుంది కదా. (నిజానికి పాఠకులకి క్లూ ఇవ్వడానికే దీన్ని చివర్లో వ్రాశాను. ఈ టపాల్లో నేనిస్తున్న రెండో క్లూ గురించి మరోసారి వ్రాస్తాను.)

పైవాటన్నింటి కవీ--ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఈయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపాన చంద్రంపాలెం అనే గ్రామం లో 1897 లో జన్మించారు. పంచెకట్టు, లాల్చీ, గిరిజాలు తో భావకవి కి ఓ మూర్తిని కల్పించారు. తొలి ఖండకావ్య సంపుటి కృష్ణపక్షం 1925 లో సాహితీ సమితి సభాపతి తల్లావఝల శివశంకర శాస్త్రి (తరువాత స్వామి) అచ్చువేయించారు. ప్రవాసం-ఊర్వశి అనే ఖండకావ్య సంపుటి 1929 లో వైతాళికులు సంకలన కర్త ముద్దుకృష్ణ అచ్చువేయించారు. 1975 లో ఆయన కవితా  స్వర్ణోత్సవ సందర్భంగా ఆరు సంపుటాలు వెలువడ్డాయి. 1. పల్లకీ-ఇతర పద్యాలు 2. కృష్ణపక్షకు-ప్రవాసము-ఊర్వశి, 3. మేఘమాల (సినీగీతాల సంపుటి), 4. శర్మిష్ఠ, 5. ధనుర్దాసు అనే రెండునాటికల సంపుటులు, 6. శ్రీ ఆండాళ్ తిరుప్పావు కు శాస్త్రిగారి తెలుగు కీర్తనలు, ఆండాళ్ కళ్యాణం నాటిక కలిసిన సంపుటి. ఇవి కాక వచన రచనలు 1. అప్పుడు పుట్టి వుంటే....., 2. పుష్పలావికలు, 3. బహుకాల దర్శనం (స్కెచ్ లు) వెలువడ్డాయి.

మల్లీశ్వరి యెవరూ మరువలేనిది!

No comments: