Sunday, February 16, 2014

పద్య సాహిత్యం--5 (జవాబులు)



ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు...........

"నేను ప్రాపంచికముగ................
..................పాద నీరాజనముల!"

1920-28 మధ్య రచించబడిన "గిరికుమారుని ప్రేమగీతాలు" అనే 102 ఖండికల గుచ్చం లోనిది. తరగలెత్తే మహాసముద్రం ప్రశాంత నదిని చేరదీసి తన కష్టసుఖాలు చెప్పుకున్నట్టుంటుందీ రచన.

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ.............................
.....................................లేకున్న మాడిపోదె!"

1921నాటి రచన "ఆంధ్ర పౌరుషం" లోనిది.

"తట్టలో్ గూర్చుండబెట్టిన.................................
..................................నొసటిపై నాడెనొకటి......."

ఇది "ఋతుసంహారం" ఖండకావ్యం లోనిది.

ఇక, వీటి రచయిత--రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఈయన 1895 లో కృష్ణా జిల్లా నందమూరులో పుట్టి, బందరు నోబుల్ కాలేజీలో చదివారు. సహస్ర మాసాలు జీవించి 1976 లో దివంగతులైనారు.

ఆయన వ్రాసిన నూరుకు మించిన పుస్తకాలలో, అపూర్వమైన ఖండకావ్యాలు--గిరికుమారుని ప్రేమగీతాలు; శృంగారవీధి; శశిదూతం; ఋతుసంహారం; ఆంధ్రప్రశస్తి; ఆంధ్ర పౌరుషం; విశ్వనాధ పంచశతి; కిన్నెరసాని, కోకిలమ్మ పెళ్లి గీతాలు; మాస్వామి; విశ్వనాధ మధ్యాక్కరలు; (సతీవియోగం తో వ్రాసిన) వరలక్ష్మీ త్రిశతి ముఖ్యమైనవి. 

50కి పైగా వ్రాసిన నవలల్లో ఏకవీర; చెలియలికట్ట; మ్రోయు తుమ్మెద; వేయిపడగలు; హాహాహూహూ విశేషమైనవి. 18 నాటకాలలో అనార్కలి; వేనరాజు; నర్తనశాల ప్రశస్తమైనవి.

ఈయన మధ్యాక్కరలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందారు. "ఆయన ఒక వ్యక్తి కాదు--ఒక వ్యవస్థ" అని కీర్తించారు తెలుగువారు.

No comments: