Saturday, February 15, 2014

పద్య సాహిత్యం--5


ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"నేను ప్రాపంచికముగ ననేక కార్య
లగ్న హృదయుండ బోలె నెల్లరకుఁ గానఁ
బడుదునే కాని, దేవి! నా భావ మెపుడు
నిత్యలగ్నంబు నీ పాద నీరాజనముల!"

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటికున్న
చాలుననువారలైనారు; చచ్చిపోయె
నేమొ జాతీయ సత్వమ్ము; కోమలంబు
మల్లికకు నీరు లేకున్న మాడిపోదె!"

"తట్టలో్ గూర్చుండబెట్టిన వధువు నా
గుమ్మడి పూవులోఁ గులికెనొకటి
ఖండితాపాంగ సక్త నవాంబు కణము నా
ఘా సాగ్రమున యందు కదలెనొకటి
తులసిమ్రుగ్గుననిడ్డ తొలుకాడు దివ్వె నా
సాలీని పటముపై సాగెనొకటి
ఘూర్జరీ ముఖలంబి కొసముత్తియంబు నా
నాఁదూడ నొసటిపై నాడెనొకటి......."

(సమాధానాలు మరోసారి)

No comments: