Tuesday, March 25, 2014

పద్య సాహిత్యం--8



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

నీవొక యప్సరః ప్రణయినీ
                    కబరీచ్యుత పారిజాత మాలా
విసరంభవో; మఱి యిలా తలమంట 
                    సుధాతుషార వర్షా విమలావ కుంఠనము 
జార్చుచు బోవు శరద్విభావరీదేవి 
                    లలాటికామణివో, దీపికవో, 
సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ 
                    చక్కదనాల హంసవై, యరిగెడు
నిన్నుజూచు నిశలందున నాకగు  బాష్పశాంతి 
                    నీవెరుగుదు; దుఃఖతాపంబుల కిల్లగు 
ప్రాడు ప్రపంచమందెరుగరు కరుణైక
                    ముగ్దుల యగాధ హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ఫలము
ఆ మరణమేను ప్రేమ గాయకుడనగుదు;
నీవు మాత్రము పూల వెన్నలల రేల
చైత్ర నృత్యోత్సవమ్ముల సలుపుకొనుము.

*             *             *

తరతరమ్ముల ప్రేమ స్వతంత్రులరుగు
దారిఁ బోయెడు నూతనాధ్వగులమనల
పరిహసించెడు పాడు ప్రపంచమునకె
పారవేయుము నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

"దగ్ధ దినైక చితా భస్మ రాశి
సుప్తివీడెడు ఉసస్సుకు పునాది
ముదిసిశిరమ్మాకు చిదిమినపట్లు
పూలకారు చివుళ్ల పురిటి పొత్తిళ్లు
గతముపై తలపేల,
క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి."  

"నీచపు దాస్య వృత్తి మన 
                    నేరని శూరత మాతృదేశ సే
వా చరణమ్మునందసువు 
                    లర్పణఁ జేసినవారి పార్థివ 
శ్రీ చెలువారు చోట తదసృగ్రుచులన్‌
                    వికసించి వాసనల్ 
వీచుచు రాలిపోవగవలెన్‌ 
                    తదుదాత్త సమాధి మృత్తిగన్‌".

(సమాధానాలు మరోసారి)

No comments: