Monday, March 10, 2014

పద్య సాహిత్యం--7 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు...................

"నెమ్మనము తాపమడగించు........................
...............................మీద మలయు టెపుడొ."

"గోడచాటయ్యు చెలినీవు...............................
.....................................వీనుల విందు గాదొ"

"హృదయ పుస్తకమందదికింపబడిన
................................ప్రాణముల్లేచి పోవకుండ"

ఇవి "సౌభద్రుని ప్రణయయాత్ర" అనే కావ్యం లోనివి.

*             *               *

"నీవు మడిగట్టుకొని........................
...........................కన్నీటిబొట్లు రాల్తు."

"ఏను స్నానమ్మునకు..........................
.......................యన్న వాయలలు నన్ను."

ఇవి "మాతృగీతాలు" అనే ఖండకావ్యం లోనివి.

*                *               *

"తురగమ్ము నెక్కి దక్షిణ
.............................దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"

ఇది "అంజలి" ఆనే ఖండిక లోనిది.

*                *                *

"నీవు చలద్ఘనాఘన వినీల...........................................
...............................అన్నగమార్గములమ్మయమ్ముగన్‌"

ఇది "జన్మభూమి" కావ్యం లోని ఖండం "ధరణీధర" లోనిది.

ఇంక వీటి  కవి శ్రీ నాయని సుబ్బారావు.

ఆయన 1899 లో, నెల్లూరు జిల్లా పొదిలె గ్రామం లో జన్మించారు. నరసరావుపేట లో చాలాకాలం అధ్యాపక వృత్తిలో వుండేవారు. 

అప్పటి కవుల్లో కొంతమంది ఊహా ప్రేయసుల గురించి కవితలల్లితే, కొందరు కులపాలికా ప్రణయాన్ని ఆశ్రయించారు. వారిలో విశ్వనాధ వారి తరవాత, నాయని వారు ప్రసిధ్ధులు. 

కులపాలికా ప్రణయం అంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లితో భార్యగా వచ్చినావిడ. విశ్వనాధవారు పెళ్లయ్యాక నాయకుడి ప్రణయాన్ని వర్ణిస్తే, నాయని ఓ అడుగు ముందుకేసి వివాహాత్పూర్వ నేపధ్యం కూడా తీసుకున్నారు.

వారి కృతులు--సౌభద్రుని ప్రణయ యాత్ర; వేదనా వాసుదేవము; మాతృగీతాలు; జన్మభూమి అనే కావ్యాలు.

సౌభద్రుని ప్రణయ యాత్ర -- అసుర కృత్యము, శుక్రవారము, ఈప్సిత లేశము, నిద్రా సౌందర్యము, ప్రణయాహ్వానము  వంటి 45 ఖండికల కావ్యం. అభిమన్య-వత్సల (శశిరేఖ) ప్రణయం.

మాతృగీతాలు కావ్యం లో మాతృగీతాలు, సౌందర్య లహరి, తత్త్వమసి, సాగర సంగీతము, ఉత్సారణము, దాస్యగీతి, అంజలి, మహోదయము, పుష్పాంజలి అనే ఖండికలున్నాయి. తల్లి మరణం బిడ్డ మనస్సు మీద చేసే గాయం యెంతటిదో దుఃఖ నిర్భరంగా చిత్రించారిందులో.

అంజలి ఖండికలో పైన వ్రాసిన పద్యం నేతాజీ వ్యక్తిత్వ చిత్రణ. కల్కి అవతారంతో పోలిక.

జన్మభూమి కావ్యం లో ప్రకృతి ఖండం, తటాక ఖండం, ధరణీధర ఖండం, శక్తి ఖండం, శివ ఖండం అనే ఐదు ఆశ్వాసాల్లో, అనేక కథలున్నాయి. ఆయన జన్మ భూమి, బాల్య స్మృతులు, జాలిగాధలూ వినిపించారు. 

భాగ్యనగర కోకిల, విషాద మోహనము అనే రెండు ఖండ కవ్యాలు కూడా వ్రాశారు.

...............మరోసారి మరి కొన్ని.

No comments: