Thursday, January 23, 2014

పద్య సాహిత్యం--3 (జవాబులు)


ఒకప్పటి కవితలు

"విరిదండ..............
..............మరపులు దోచె."

ఇవి 1922 లో ప్రచురణ పొందిన "ఏకాంతసేవ" అనే కావ్యం లోనివి.

"చెట్టునకు మొగ్గ..............
...........................ప్రేమకొరకు."

ఖండకృతుల లోనివి.

"నీ నీడలోనుంటి.....................
................................నేనను కొందునె ప్రభు?"

ఇది 1943 లో వెలువడిన "భావ సంకీర్తనలు" లోనిది.

"కుమ్మరిసారె.................
.................నెచ్చెలులెంత పిల్చినన్."

ఇది "బృందావనం" అనే లఘుకావ్యం నుంచి, బృంద బొమ్మల పెళ్ళిళ్ళు ఎందుకు ఆడడంలేదో చెబుతుంది.

ఇంక, "వెంకట పార్వతీశ్వర కవులు" గా ప్రసిధ్ధి చెందినవారిలో బాలాంత్రపు వెంకటరావుగారు 1880 లో జన్మించారు. రెండోవారు ఓలేటి పార్వతీశం గారు 1882 లో జన్మించారు. ఇవి వారి రచనల్లోవి.

వీరు అనేక నవలలు, కావ్యాలూ వ్రాశారు. తెలుగునాట నవలలకి గొప్ప గిరాకీ ఏర్పరిచింది వీరేనట. నవలలు చాలా భాగం బెంగాలీ అనువాదాలు. స్వతంత్ర రచనల్లో, 1910 లో ప్రచురించబడిన "మాతృమందిరం", "దుర్గేశనందిని", "ప్రమదావనం", "వసుమతీవసంతం" కాక ఇంకా చాలా వున్నాయి. 

కావ్యాలు "ఏకాంతసేవ", "భావ సంకీర్తనలు", "బృందావనం", "కావ్య కుసుమావళి" మొదలైనవి. ఏకాంతసేవ ని "వంగభాషకు గీతాంజలి ఎలాంటిదో తెలుగుభాషకిది అలాంటిదని నా అభిప్రాయం" అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

నవ్యకవులమీద వీరి ప్రభావం వుంది.

(ఈ వ్యాసాలు నేను, పద్య సాహిత్యం మీది అభిమానం కొద్దీ, సేకరించి వ్రాస్తున్నవే. అసలు వీటిని వ్రాసిన రచయితల వివరాలు కూడా వ్రాస్తాను. అంతవరకూ వారికి నా క్షమాపణలు.)

No comments: