అంటే—కృతి మొదలుపెట్టేటప్పుడు కవి పొందే (దాదాపు పురిటి నొప్పుల్లాంటి) అవస్థ (ట)!
ఓ కవిగారు, పాపం చాలా పేదవాడు! వచ్చిన కవిత్వమూ అంతంత మాత్రమే! భార్య సలహాతో, రాజుగారి దగ్గరకి వెళ్ళి కవిత్వం వినిపిస్తే, యెంతో కొంత కిట్టక పోతుందా అని అలో…..చించి, మూడు పద్య పాదాలు తయారు చేసుకున్నాడట!
యేమిటవి?
“అనవేమ మహీపాలా!
రణమునందు కడు శూర్లు,
ఈవులందు శిబి చక్రవర్తులు!”
ఆని!
ఆఖరు పాదం రావడంలేదట యెంత ప్రయత్నించినా!
ఆ పాదం గురించి గుండా పిండి అయిపోతుంటే, భార్య అందిట ‘ఆ మాత్రానికి అంత ప్రయత్నం యెందుకండీ? మీ సంధ్యావందనంలో ఓ ముక్క వేసుకో వచ్చు కదా?’ అని!
వెంటనే మన కవిగారు……..పద్యం పూరించాడు……..వృత్తం మార్చుకొని……ఇలా!
".....శభాషునే భళా ముండా! ధీయోయోనహ్ ప్రత్యోదయాత్!” అని!
బాగుందా? (రాజేమన్నాడో మరోసారి!)
జగద్విఖ్యాతిగాంచిన ‘అన్నమయ్య’ తెలుగు చిత్రానికి పాటలు వ్రాసిన (శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారే అనుకుంటా) కవి కృత్యాద్యవస్థని చూసి నాకు ఈ సన్నివేశమే గుర్తు వచ్చింది!
మరి లేకపోతే……..
‘………….అవతరించెను అన్నమయ,
అసతోమా సద్గమయ!’ (ట)!
ఇంకో చరణం లో……..
తమసోమా జ్యోతిర్గమయ! (ట)!
వీని భావంబేమి తిరుమలేశా!
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
No comments:
Post a Comment